రాత్రి 9గంటలకు నాన్నమ్మతో కెమెరాలో మాట్లాడానా అరటి పండు తిన్నానని నాకు వేడినీళ్ళతో స్నానం చెయించాడు నాన్న. నాన్నకు నా ముఖం తోమడం రాదు కాస్త నీళ్ళు ఎక్కువపోసాడేమో తాగేశాను. అంతే ఇక అక్కడినుండీ జలుబు మొదలైంది. దానిలోనే జ్వరం, ఆయాసం, వాంతులు ఒకదానితరువాత ఒకటి అయిపోయాయి. అమ్మ కంగారు పడిపోయింది. నాన్న పరవాలేదన్నా ఏదో భయంగానే ఉంది తనకు. ఇక రాత్రంతా నేను నిద్రపోలేదు, అమ్మనాన్నలను నిద్రపోనీయలేదు. తెల్లవారాక కూడా అదే పరిస్థితి మళ్ళీ వాంతులయ్యాయి. నాన్న ఆసుపత్రికి తీసుకుపోదామన్నాడు. అమ్మనేను నాన్న బయలుదేరాం. డాక్టర్ గారు నన్ను చూడగానే ఇవి నిమోనియా చాయలన్నాయి వెంటనే జాయిన్ చేసుకోవాలన్నారు. నన్ను డాక్టర్ గదిలో ఉంచుకుని నాన్నని, అమ్మని బైటికి వెళిపోమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో బైట తెలియని నాన్న తెగ కంగారు పడిపోయాడు. నేను మాత్రం వాళ్ళు సెలైన్ పెట్టడానికి సూది గుచ్చినా ఏడవలేదు. అది చూసిఅందరూ తెెగ వింతగా చెప్పుకున్నారు.
నేను ఆసుపత్రిలో ఓరోజంతా ఉన్నాను.
ఈమధ్య అసలు బాగాలేదు నాకు ఒకటే జ్వరం తగ్గుతుంది వస్తుంది. అంతా కంగారు పడుతున్నారు. అమ్మకు నావల్ల పనిపెరిగింది. నాన్నకు బిల్లు పెరిగింది. నాకు నీరసం పెరిగింది. ఇదీ సంగతి. వేలతో నయం కాని నా జ్వరం నాన్నమ్మ హోమియో పతి మందుతో నయం అయిపోయిందని నాన్నఅమ్మ తెగ చెప్పుకుంటున్నారు.
ఇక నాయనమ్మ నాగురించి ఫోన్లో సమాచారం కనుక్కోవడంతో సరిపోతుంది. ఇప్పుడన్నీ తగ్గాయనుకుంటుంటే మళ్ళీ అమ్మవారు పూసింది ఇది ఎప్పుడు తగ్గుతుందో మరి. :(
నేను ఆసుపత్రిలో ఓరోజంతా ఉన్నాను.
ఈమధ్య అసలు బాగాలేదు నాకు ఒకటే జ్వరం తగ్గుతుంది వస్తుంది. అంతా కంగారు పడుతున్నారు. అమ్మకు నావల్ల పనిపెరిగింది. నాన్నకు బిల్లు పెరిగింది. నాకు నీరసం పెరిగింది. ఇదీ సంగతి. వేలతో నయం కాని నా జ్వరం నాన్నమ్మ హోమియో పతి మందుతో నయం అయిపోయిందని నాన్నఅమ్మ తెగ చెప్పుకుంటున్నారు.
ఇక నాయనమ్మ నాగురించి ఫోన్లో సమాచారం కనుక్కోవడంతో సరిపోతుంది. ఇప్పుడన్నీ తగ్గాయనుకుంటుంటే మళ్ళీ అమ్మవారు పూసింది ఇది ఎప్పుడు తగ్గుతుందో మరి. :(
No comments:
Post a Comment